న్యూఢిల్లీ: ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ ఇంగ్లండ్ పర్యటనకు స్టాండ్బైగా ఎంపికయ్యాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు టీమ్ఇండియా జూన్ 2న ముంబై నుంచి బయలుదేరనుంది. ఈ జట్టులో రెగ్యులర్ వికెట్ కీపర్లు రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా ఉన్నప్పటికీ.. మూడు నెలల సుదీర్ఘ పర్యటన కావడంతో బీసీసీఐ ముందు జాగ్రత్తగా భరత్ను బుధవారం ఎంపిక చేసింది.