ప్రత్యేక కలెక్టర్ పద్మశ్రీ
పంచవటి దవాఖాన తనిఖీ
రోగుల కేషీట్లు, స్కానింగ్ రిపోర్టులు, వాటి ధరల పరిశీలన
అధిక ధర వసూలుపై ఆగ్రహం
భూత్పూర్, మే 19 : కరోనాతో సతమతమవుతున్న ప్రజల నుంచి ప్రైవేట్ దవాఖానల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని ప్రత్యేక కలెక్టర్ పద్మశ్రీ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పంచవటి దవాఖానను జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ కమిటీ దవాఖానలోని కరోనా బాధితుల వివరాలను తెలుసుకున్నారు. రోగుల కేషీట్లు, స్కానింగ్ రిపోర్ట్లు, వాటి ధరలను పరిశీలించారు. స్కానింగ్కు అధిక ధర వసూలు చేసినట్లు ప్రత్యేక కలెక్టర్ దృష్టికి రావడంతో దవాఖాన యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సూచనల మేరకు కొ విడ్ బాధితులకు 20శాతం బెడ్లను కే టాయించాలని తెలిపారు.
ముందుగా దవాఖానలో బిల్లులకు సంబంధించిన చార్ట్ను పేషంట్లకు కన్పించే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రైవేట్ దవాఖానల్లో వై ద్యం చేయించుకోవడానికి సాధ్యం కా ని వారు దేవరకద్ర, బాలానగర్, కో యిలకొండ మండలాల్లో అందిస్తున్న వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఆయా దవాఖానల్లో పౌష్టికాహారం అందించడంతోపాటు, మెరుగైన వై ద్యం అందిస్తున్నట్లు వివరించారు. కా ర్యక్రమంలో టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు డీఎంహెచ్వో కృష్ణ, డీఎస్పీ శ్రీధర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ అరవింద్కుమార్, మాస్ మీడియా అధికారి తిరుపతిరావు, భూత్పూర్ సీఐ రజితారెడ్డి, ఎస్సై భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.