సోఫియా (బల్గేరియా): భారత మహిళా రెజ్లర్ సీమా బిస్లా టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్లో సత్తాచాటి ఫైనల్ చేరింది. 50 కేజీల సెమీస్లో బిస్లా 2-1తో అన్నా లుకాసియాక్ (పోలండ్)పై గెలిచి, టోక్యో టికెట్ దక్కించుకున్న భారత నాలుగో మహిళా రెజ్లర్గా నిలిచింది. కాగా పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన సుమీత్ మాలిక్ (125 కేజీలు) గాయం కారణంగా ఫైనల్ నుంచి తప్పుకొని, రజత పతకంతో సరిపెట్టుకున్నాడు.