హ్యూస్టన్ : భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వినోద్ ఖోస్లా భారత్కు 10 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్తో పోరాడుతున్న భారతదేశంలోని దవాఖానలకు ఆక్సిజన్ సరఫరా కోసం భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్త వినోద్ ఖోస్లా 10 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 73.88 కోట్లు) అందిస్తున్నట్లు ప్రకటించారు.
కరోనా వ్యాప్తి పెరుగుతున్న ఈ సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన అవసరం ఉన్నదని వినోద్ ఖోస్లా అన్నారు. మరింత ఆలస్యం చేస్తే ఇంకా ఎక్కువ మంది మరణాలకు దారితీయవచ్చు అని ఆయన పేర్కొన్నారు. ‘గివ్ ఇండియాకు ఇది చాలా ఎక్కువ కాదు’ అని వినోద్ ఖోస్లా ట్వీట్ చేశారు. భారతదేశంలోని ప్రభుత్వేతర సంస్థలు, దవాఖానల నుంచి నిత్యం 20,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 15,000 ఆక్సిజన్ సిలిండర్లు, 500 ఐసీయూ పడకలు, 100 వెంటిలేటర్లు, 10,000 పడకల కోసం ప్రజల నుంచి అభ్యర్థనలు అందుతున్నాయి. గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం తమ కుటుంబం 10 మిలియన్ డాలర్లు భారత్కు సాయంగా అందిస్తున్నదని ఆయన చెప్పారు. ఈ సమయంలో ఆపన్నులను ఆదుకునేందుకు ఇతర వ్యక్తులు కూడా ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పంచాయతీ విజయం చూడకముందే ముగ్గుర్ని కాటేసిన కరోనా
లాక్డౌన్ విధించండి.. క్యాట్ సర్వేలో ప్రజలు
ఈ నెల 10 న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్న కేపీ ఒలి
చైనాపై వైఖరి మార్చుకున్న న్యూజిలాండ్
తన నిర్ణయాన్ని సమర్ధించుకున్న ఆస్ట్రేలియా ప్రధాని
మయన్మార్లో ఆర్మీ అణచివేత: సైన్యం కాల్పుల్లో 8 మంది మృతి
గ్లేసియర్స్ కరిగి ఏర్పడిన వేలాది సరస్సులు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఆన్లైన్లో 60 మంది వైద్యులు.. వివిధ భాషల్లో సేవలు
అద్వానీ రథయాత్ర కారకుడు ప్రమోద్ మహాజన్.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..