డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సాల్ట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ముందంజలో ఉన్నది. ఇక్కడ బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి మహేశ్ జీనా తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి గంగా పంచోలిపై ఐదో రౌండ్ ముగిసే సరికి 1,759 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రతీ రౌండ్లోనూ మహేశ్ జీనా-గంగా పంచోలి మధ్య నువ్వానేనా అన్నంత పోటీ నెలకొన్నది. ఇప్పటివరకు కేవలం 13 వేల ఓట్లు మాత్రమే లెక్కించారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులతోపాటు మరో ఐదుగురు బరిలో ఉన్నారు.
సాల్ట్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన సురేంద్ర సింగ్ జీనా కొవిడ్ బారిన పడి గత ఏడాది నవంబర్ నెలలో చనిపోయారు. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మరణించిన సురేంద్ర సింగ్ జీనా సోదరుడు అయిన మహేశ్ జీనాను తమ అభ్యర్థిగా బీజేపీ నిలిపింది. కాగా, ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని , వాటిని పరిశీలించాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయితే, వారిని పోలీసులు సముదాయించి బయటకు పంపించారు.
కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉండటంతో ఇక్కడ ఉన్నతాధికారులు కఠిన నిబంధనలు అమలుపరుస్తున్నారు. కొవిడ్ నెగెజివ్ నివేదిక ఉన్నవారినే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించారు.
ఎంపీ ఉప ఎన్నిక : దమోహాలో కాంగ్రెస్ ముందంజ
రాజస్థాన్ ఉప ఎన్నిక : ఒక్క స్థానంలో బీజేపీ, రెండింటిలో కాంగ్రెస్ ఆధిక్యం
యూపీలో వారాంతపు లాక్డౌన్ సమయం పొడగింపు
అసోంలో అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా ఎన్డీఏ
ఆధిక్యంలో తమిళనాడు సీఎం పళనిస్వామి
బెంగాల్లో బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా!
పుదుచ్చరిలో ముందంజలో ఎన్డీఏ కూటమి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..