ఆర్మూర్, ఏప్రిల్ 30 : ఆర్మూర్ నియోజకవర్గంలో పేద ఆడబిడ్డలకు ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీముబారక్’ పథకాలు వరంగా మారాయని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు శుక్రవారం చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ లక్ష్మణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా, టీఆర్ఎస్ నాయకులు ఖాందేశ్ శ్రీనివాస్, పండిత్ ప్రేమ్, పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, పూజా నరేందర్, బెన్కి గంగామోహన్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని ఆలూర్ గ్రామం లో 14 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, సర్పంచ్ కల్లెం మోహన్రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్మూర్ వైస్ ఎంపీపీ మోతె భోజకళాచిన్నారెడ్డి, ఎంపీటీసీ మార్కంటి లక్ష్మీ మల్లేశ్, ఆలూర్ పీఏసీఎస్ చైర్మన్ కల్లెం భోజారెడ్డి, ఉపసర్పంచ్ దుమ్మాజీ శ్రీనివాస్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ మూలాకిడి శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు భోజన్న, అగిడి సత్యం, బొప్పారం రమేశ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
నందిపేట్ రూరల్, ఏప్రిల్ 30: ఎంపీపీ వాకిడి సంతోష్రెడ్డి స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో కుద్వాన్పూర్ సొసైటీ చైర్మన్ వాకిడి కార్తీక్రెడ్డి, సర్పంచ్ కాటిపల్లి లలిత, ఉప సర్పంచ్ కాటిపల్లి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దత్తాపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ సుంకరి రాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు జంగం నర్సయ్య, ముత్యం నారాగౌడ్, వార్డు సభ్యురాలు గంగుబాయి ఉన్నారు.
వేల్పూర్,ఏప్రిల్ 30 : మండలంలోని పోచంపల్లి గ్రామంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను సర్పంచ్ అనంత్రావు శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.