నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 27 : తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ శ్రేణులు మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ గులాబీ జెండాలను ఎగురవేశారు. జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ సాగించిన పోరును ప్రజలుఎన్నటికీ మరిచిపోలేరని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గడ్డం చంద్రశేఖర్రెడ్డి, సీనియర్ నాయకుడు జూకంటి ప్రభాకర్రెడ్డి, గెరిగంటి లక్ష్మీనారాయణ, పిట్ల వేణుగోపాల్, చాట్ల వంశీకృష్ణ, భూమేశ్యాదవ్, సబ్బని కృష్ణహరి, నరేశ్రెడ్డి, బండారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ పట్టణంలోని కార్యాలయం ఆవరణలో పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్ గులాబీ జెండాను ఆవిష్కరించారు. మండలంలోని బోర్లం, బోర్లంక్యాంపు, పోచారం, దేశాయిపేట్, ఇబ్రహీంపేట్ తదితర గ్రామాల్లో పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు జెండాలను ఎగురవేశారు. మున్సిపల్ చైర్మెన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ దుద్దాల అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, ప్యాక్స్ చైర్మన్ పిట్ల శ్రీధర్, నాయకులు మహ్మద్ ఎజాస్, జుబేర్, గోపాల్రెడ్డి, రాజేశ్వర్ గౌడ్, బాబా, లింగమేశ్వర్, బాడీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
నస్రుల్లాబాద్ మండల కేంద్రంతోపాటు దుర్కిలో టీఆర్ఎస్ నాయకులు పార్టీ జెండాలను ఆవిష్కరించి జై తెలంగాణ నినాదాలు చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, విండో చై ర్మన్ దివిటి శ్రీనివాస్ యాదవ్, మాజీ జడ్పీటీసీ కిశోర్ యాదవ్, నస్రుల్లాబాద్ గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు మైశాగౌడ్, నాయకులు కంది మల్లేశ్, నారాయణ, రవీందర్, ఖలీల్ పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలో టీఆర్ఎస్ నాయకులు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధనే ఏకైక లక్ష్యంగా టీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జలంధర్రెడ్డి, జడ్పీటీసీ ఊషాగౌడ్, ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింహులు, అడ్వకేట్ నామ శ్రీనివాస్, నాయకులు రామప్ప, నాయిని సాయిరాములు, అల్లం శ్రీను, ముజ్జు, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట మండలంలో గులా బీ జెండా రెపరెపలాడింది. మండల కేంద్రంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు దివిటి రమేశ్, గ్రామాల్లో నాయకులు జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో లింగంపేట సహకార సంఘం చైర్మన్ దేవేందర్రెడ్డి, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు నరేశ్తోపాటు నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సదాశివనగర్ మండలం భూంపల్లిలో టీఆర్ఎస్ జెండాను ఎంపీపీ గైని అనసూయా రమేశ్ ఆవిష్కరించారు. దత్తురావు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్లో పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, గ్రామాల్లో పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు గులాబీ జెండాలను ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్, సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, సొసైటీ చైర్మన్ వాజిద్అలీ, నాయకులు రమేశ్, కాశయ్య తదితరులు పాల్గొన్నారు.
పిట్లం మండలకేంద్రంలోని తెలంగాణ భవన్ వద్ద టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు బుడాల నవీన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మండలంలోని తిమ్మానగర్, రాంపూర్, చిల్లర్గి, చిన్నకొడప్గల్ గ్రామాల్లో పార్టీ గ్రామకమిటీల అధ్యక్షులు టీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ కవితా విజయ్, పిట్లం సర్పంచ్ విజయలక్ష్మీ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, నాయకులు బాల్రెడ్డి, జొన్న శ్రీనివాస్రెడ్డి, కొటారి ప్రభు, ఉపసర్పంచ్ ఇబ్రాహీం తదితరులు పాల్గొన్నారు.
బిచ్కుంద మండలకేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు జెండాను ఎగురవేశారు. వాజిద్నగర్లో సర్పంచ్ అనూయ, లక్ష్మీనారాయణ పార్టీ జెండాను ఎగురవేసి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ అశోక్ పటేల్, జడ్పీటీసీ భారతీరాజు, సొసైటీ చైర్మన్ బాలాజీ, రామ్ మందిర్ అధ్యక్షుడు లక్ష్మణ్, నాయకులు పాల్గ్గొన్నారు.
మద్నూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద టీఆర్ఎస్ నాయకులలు పార్టీ జెండాను ఎగురవేసి జై తెలంగాణ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్, సర్పంచ్ దరాస్ సూర్యకాంత్, నాయకులు విఠల్, హన్మాండ్లు, సుభాష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
దోమకొండ మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఐరేని నర్సయ్య, నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎంపీపీ కోట సదానంద, జడ్పీటీసీ తిర్మల్గౌడ్, ఏఎంసీ చైర్మన్ కుంచాల శేఖర్, సర్పంచులు నర్స వ్వ, అంజలి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ నర్సారెడ్డి, నాయకులు నాగరాజు, శంకర్, కిషన్రెడ్డి పాల్గ్గొన్నారు.
మాచారెడ్డి మండలంలో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గజ్యానాయక్తండాలో పార్టీ మండల అధ్యక్షుడు హంజీనాయక్ టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీనివాసాచారి, అబ్దుల్ఖాన్, శ్రీధర్రావు, అజీజ్, నర్సింహులు, హన్మాండ్లు, దయాకర్రావు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
బీర్కూర్లోని కామప్ప చౌరస్తాలో టీఆర్ఎస్ జెండాను పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దుంపల రాజు ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తాడ్వాయి మండలంలో టీఆర్ఎస్ శ్రేణులు పార్టీ జెండాలను ఆవిష్కరించి జై తెలంగాణ నినాదాలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, కార్య దర్శి గోపాల్రావు, నాయకులు రాజయ్య, గంగారెడ్డి, మోహన్ రెడ్డి, ధర్మపురి, రమేశ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.