టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైనప్పటికీ దిల్ రాజుకు పవన్ కళ్యాణ్తో సినిమా తీయడానికి చాలారోజులే ఎదురుచూడాల్సి వచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన 22 ఏళ్లకు వకీల్ సాబ్ సినిమాతో ఆయన కల నెలవేరింది. ఇప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్తో సినిమా చేయబోతున్నాడు దిల్ రాజు. ఈ మధ్య దిల్ రాజు, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన వకీల్ సాబ్ సినిమా రూ.80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామి సృష్టించింది. అయితే కరోనా వైరస్ కారణంగా కొన్ని చోట్ల సినిమాకు నష్టాలు తప్పలేదు. సరైన సమయంలో వకీల్ సాబ్ విడుదలై ఉంటే కచ్చితంగా రూ.150 కోట్లు వసూలు చేసేదని బల్లగుద్ది చెబుతున్నారు ట్రేడ్ పండితులు. డిస్ట్రిబ్యూటర్ల సంగతి పక్కన పెడితే దిల్ రాజు మాత్రం ఈ సినిమాతో చాలా హ్యాపీగా ఉన్నాడు. వకీల్ సాబ్ ఈయనకు మంచి లాభాలు తీసుకొచ్చింది. కేవలం థియేట్రికల్ కలెక్షన్స్ మాత్రమే 80 కోట్లకు పైగా వచ్చాయి. ఇంకా డిజిటల్ శాటిలైట్ అలాగే ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే మరో 50 నుంచి 70 కోట్ల ఆదాయం వస్తుంది.
ఇదిలా ఉంటే వకీల్ సాబ్ విడుదలైన నెల రోజుల్లోనే దిల్ రాజుకు మరో కమిట్మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఆయనతో మరో సినిమా చేయడానికి అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. మీతో నేను ఎన్ని సినిమాలు అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.. అది నేను గౌరవంగా భావిస్తున్నాను అంటూ ప్రీ రిలీజ్ వేడుకలో తాను చెప్పిన మాటలు ఇప్పుడు పాటిస్తున్నాడు పవన్. ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు పూర్తయిన తర్వాత దిల్ రాజుతో మరోసారి వర్క్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు పవర్ స్టార్. ఈ సబ్జెక్టుకు పవర్ ఫుల్ డైరెక్టర్ ను సెట్ చేయడానికి దిల్ రాజు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ట్రక్కు డ్రైవర్ గా రకుల్ప్రీత్సింగ్
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
అల్లు అర్జున్ పాటను వాడేసిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్
కలర్స్ స్వాతి రీ ఎంట్రీ.. కొత్త కాన్సెప్ట్తో అలరించేందుకు రెడీ..!
జాతి రత్నాలు సీక్వెల్కు సన్నాహాలు.. స్టోరీ లైన్ ఇదే!