మడికొండ, ఏప్రిల్ 18 : గ్రేటర్ ఎన్నికల్లో కార్యకర్తలు కలిసికట్టుగా పని చేసి టీఆర్ఎస్ను గెలిపించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కోరారు. 64వ డివిజన్కు చెందిన నాయకులతో ఆదివారం తన నివాసంలో ఎన్నికలపై చర్చించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. టీఆర్ఎస్ తరపున టికెట్ ఆశించిన వారికి తప్పుకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో డివిజన్ ఇంచార్జి మార్గం భిక్షపతి, ఆవాల రాధికారెడ్డి, పోలపల్లి రామ్మూర్తి, దువ్వ నవీన్, దువ్వ శ్రీకాంత్, ఆకారపు నాగరాజు ఉన్నారు. కాగా, 64వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆవాల రాధికారెడ్డిని ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రకటించడంతో ఆమె మడికొండ నుంచి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు.