పిట్లం, ఏప్రిల్ 16 : కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మార్దండ గ్రామం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. పల్లె ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే బురదమయంగా మారే రోడ్లను గ్రావెల్గా మార్చుకున్నారు. రూ 2.50 లక్షలతో కంపోస్ట్షెడ్డు, రూ.50 వేలతో డంపింగ్యార్డు అందుబాటులోకి తెచ్చుకుని చెత్తను సేకరించడంతో ఊరంతా పరిశుభ్రమైన వాతావరణం నెలకొన్నది. కొత్తగా కొనుగోలు చేసిన ట్రాక్టర్ను పారిశుద్ధ్య పనుల కోసం వినియోగిస్తున్నారు. ట్యాంకర్ సహాయంతో గ్రామంలో మొక్కలకు నీళ్లు పోస్తున్నారు.
లక్ష రూపాయలతో అర ఎకరం స్థలంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతివనం ఆహ్లాదాన్ని పంచుతున్నది. 800 మొక్కలు, వివిధ రకాల పూల మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. గ్రామంలో 60 వేల లీటర్ల నీటి సామర్థ్యం గల వాటర్ట్యాంకు నిర్మాణం చేపట్టి గ్రామంలోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామంలో 110 మంది నూతనంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టుకున్నారు. రూ.12 లక్షలతో సకల సౌకర్యాలతో వైకుంఠధామాన్ని నిర్మించారు. గ్రామంలోని హరితహారం కార్యక్రమంలో భాగంగా మొదటి విడుత 18 వేల మొక్కలు, రెండో విడుత ఐదు వేల మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. గ్రామంలో ప్రతిరోజూ పంచాయతీ కార్మికులు ప్రతి కాలనీలో తిరుగుతూ పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూస్తున్నారు.
స్వచ్ఛత దిశగా అడుగులు