దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు పెద్ద షాక్ ఇచ్చింది. కొవిడ్ నియంత్రణ పేరుతో ప్ల్లాట్ఫాం చార్జీలను భారీగా పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. రూ.30 నుంచి రూ.50కి పెంచినట్లు ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ ప్రకటించారు. కరోనా వ్యాప్తి వల్ల ఎక్కువ మంది ప్రయాణికులు ప్లాట్ఫాంలకు చేరకుండా నియంత్రించడం కోసమేనని.. కారణం చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. పెరిగిన చార్జీలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కే రూ.50 వసూలు చేస్తామని, మిగిలిన స్టేషన్లకు సంబంధించి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.