కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడుత పోలింగ్ సందర్భంగా కూచ్ బిహార్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించడాన్ని బెంగాల్ సీఎం మమతాబెనర్జి ఒక హత్యాకాండగా అభివర్ణించారు. అది అప్పటికప్పుడు జరిగిన ఘటన కాదని, కేంద్ర బలగాలు ఉద్దేశపూర్వకంగానే నలుగురు అమాయకులను కాల్చిచంపాయని ఆమె ఆరోపించారు. వాళ్లకు చంపే ఉద్దేశం లేకుండా కాళ్లపైననో లేదంటే శరీరాల కిందవైపునో కాల్చేవాళ్లని.. చంపాలనుకున్నారు కాబట్టే మెడపైన, ఛాతిపైన కాల్చారని గురిపెట్టి కాల్చారని మండిపడ్డారు.
దేశంలో అసమర్థ ప్రధాని, అసమర్థ హోంమంత్రి నేతృత్వంలో ఒక అసమర్థ ప్రభుత్వం నడుస్తున్నదని మమతా బెనర్జి విమర్శించారు. ప్రధాని, హోంమంత్రి బెంగాల్ను దక్కించుకోవడానికి రోజూ వస్తున్నారని, వాళ్లు వచ్చిపోవడం తప్పుకాదు కానీ, రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చురేపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర బలగాల చేత ప్రజలను చంపించి ఆ తర్వాత వాళ్లకు క్లీన్ చిట్ ఇస్తారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలకు వీడియో కాల్స్ చేసి మమత మాట్లాడారు. వారు ఆవేదనను తన ముందున్న మీడియా ప్రతినిధులకు వినిపించారు. తాను ఈ నెల 14న వస్తానని, ఇంటింటికీ వచ్చి అందరి కుటుంబాలను పరామర్శిస్తానని బాధిత కుటుంబాలకు మమతాబెనర్జి భరోసా ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
టీకాలే లేకుండా టీకా ఉత్సవ్ ఎలా.. ప్రధానికి ముఖ్యమంత్రుల లేఖలు..!
వ్యాక్సినేషన్ రికార్డు.. 85 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా
నాలుగు రోజుల టీకా ఉత్సవ్.. నాలుగు సూచనలు చేసిన మోదీ
తెలంగాణలో కొత్తగా 3,187 కరోనా కేసులు
దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. 24గంటల్లో 1.53లక్షల కేసులు