ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 6 : నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వారికి మంగళవారం క్యాంపు కార్యాలయంలో సహాయనిధి చెక్కులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంచాలకు చెందిన పర్వతాలుకు రూ.60వేలు, శ్రీనాథ్కు రూ.52వేలు, అబ్దుల్లాపూర్మెట్కు చెందిన సక్కుబాయికి రూ.60వేలు, మల్లయ్యకు రూ.32వేలు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని శేరిగూడకు చెందిన మమతకు రూ.60వేలు, కృష్ణయ్యకు రూ.10వేల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కు అందజేత
పేదల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఏక్వాయిపల్లికి చెందిన శ్రీనివాస్కు మంజూరైన రూ.15 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్సీ అందజేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేదలకు వరంలా మారిందన్నారు. కార్యక్రమంలో నాయకులు రాంచంద్రయ్య, సుమన్ తదితరులు పాల్గొన్నారు.