బీజాపూర్ : ఛత్తీస్ఘడ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలీస్ కానిస్టేబుల్ను అపహరించి దారుణంగా హతమార్చారు. బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. భైరంగర్హ్ పోలీస్ పరిధిలోని పొందుం గ్రామంలో శనివారం సాయంత్రం కానిస్టేబుల్ సన్ను పునెంను మావోయిస్టులు అహరించారు. ఆదివారం ఉదయం కేష్కుతుల్ గ్రామసమీపంలో కానిస్టేబుల్ మృతదేహాన్ని గుర్తించామని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ పీ సుందర్ రాజ్ తెలిపారు. సన్ను పునెం బీజాపూర్ జిల్లా గంగ్లూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం సెలవుపై స్వగ్రామానికి వెళ్లాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పదునైన ఆయుధంతో నరకడంతో కానిస్టేబుల్ మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో పోలీస్శాఖ అప్రమత్తమైంది. మావోయిస్టుల ఆచూకీ కనుగొనేందుకు భద్రతాదళాలు గాలింపు చేపట్టాయి.