హైదరాబాద్ : ప్రపంచ సోషల్ వర్క్ దినోత్సవాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. సోషల్ వర్క్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (స్వాట్) ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాలలోని సోషల్ వర్క్ విభాగంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు మాట్లాడుతూ ప్రపంచ వేదికపై ‘ఉబంటు’ (మనం ఉన్నాం కాబట్టి నేను ఉన్నాను) నినాదాన్ని ప్రచురించారని చెప్పారు. సమాజ శ్రేయస్సులో సోషల్ వర్క్ ప్రాధాన్యత ఎంతో ఉంటుందని చెప్పారు. దీని ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ సోషియాలజీ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మెన్ డాక్టర్ భీనవేణి రామ్ షెఫర్డ్, స్వాట్ ప్రతినిధులు జడిగె వెంకటేశ్వర్లు, డాక్టర్ నరేశ్, షికా దిలీప్కుమార్, శ్రీనివాస్, ధరావత్ కోటి, భగత్చంద్ర, వెంకట్, వంశీధర్, సుధాకర్, డాక్టర్ సురేశ్, ఎర్రస్వామి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.