టాలీవుడ్ హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. మూస కథలకు భిన్నంగా వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉండగా, ఈ సినిమా తర్వాత దర్శక దిగ్గజం శంకర్ తో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా, అతి త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం దిల్ రాజు వంద కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం.
రాజకీయ నేపథ్యంలో రామ్ చరణ్- శంకర్ సినిమా ఉంటుందని ప్రచారం నడుస్తుంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుథ్ రవిచంద్రన్ను ఎంపిక చేసినట్టు గతంలో ప్రచారం జరగగా, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ పేరు వినిపిస్తుంది. రీసెంట్గా ఓ నెటిజన్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు అని రెహమాన్ను అడగగా, దానికి అతి త్వరలోనే అని సమాధానం ఇచ్చారు. శంకర్- రామ్ చరణ్ సినిమాతో రెహమాన్ మళ్లీ టాలీవుడ్కు రీ ఎంట్రీ ఇవ్వనున్నాడని టాక్. అతి త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.