ఆహారంలో పులిసిన పదార్థాల ఉపయోగం గురించి ప్రత్యేకించి చర్చించాల్సిన పన్లేదు. భారతీయుల పాకశాస్త్రంలో వీటిదే సింహభాగం. పెరుగు, ఇడ్లీ, దోశ లాంటివన్నీ పులియబెట్టిన ఆహారం కిందికే వస్తాయి. ఓ తాజా పరిశోధన వీటి గురించి మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపెట్టింది. పులిసిన పదార్థాలు, పీచు పదార్థాలు… రెండిటిలో ఏవి ఎక్కువ ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలనుకున్నారు ‘స్టాన్ఫర్డ్ మెడిసిన్’ పరిశోధకులు. దీనికోసం 36 మందిని రెండు బృందాలుగా విభజించి ఒక్కో బృందానికి ఒక్కో తరహా ఆహారాన్ని అందించారు. పదివారాల పాటు ఈ ఆహారాన్ని తీసుకున్న తర్వాత, శరీరంలో వచ్చిన మార్పులను పరీక్షించారు. ఆశ్చర్యంగా మన శరీరంలో హానికరమైన ప్రభావాన్ని చూపే 19 రకాల ప్రొటీన్లను, పులియబెట్టిన పదార్థాలు గణనీయంగా తగ్గించినట్టు తేలింది. వీటిలోని interleukin-6 అనే ప్రొటీన్ అయితే మధుమేహం, కీళ్లవాతం లాంటి అనారోగ్యాలకు కూడా కారణం అవుతూ ఉంటుంది. పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఇలాంటి చెడు ప్రభావాలేమీ కనిపించకపోవడం విశేషం.