డాక్టర్ అంటే రోగం వచ్చిన తర్వాత చికిత్స చేస్తాడని అనుకుంటాం. అయితే రోగాలు రాకముందే జాగ్రత్తలు చెప్పడం మంచి వైద్యుడికి ఉండాల్సిన లక్షణం. ‘ఓ వైద్యుడి వలపోత’ అనే వ్యాసాల సంకలనం ద్వారా చెవి, ముక్కు, గొంతు (ఇఎన్టి) స్పెషలిస్ట్ డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి అలాంటి మజీవితంపై అవగాహనంచిపనే చేశారు. ‘నమస్తే తెలంగాణ’ సహా వివిధ దినపత్రికలకు రాసి
న వ్యాసాల ద్వారా కరోనా కష్టకాలంలో సమకాలీన సమస్యలపై సమాజానికి ఆయన అవగాహన కల్పించారు. కంటికి కనిపించని కొవిడ్ వైరస్, ఏడాదికిపైగా మొత్తం ప్రపంచాన్ని స్తంభింపజేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ వైరస్ గురించి, ఆ మహమ్మారి సోకినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, కొవిడ్ టీకాలు వేయించుకోవాల్సిన అవసరం గురించి.. రవిశంకర్ తన వ్యాసాల ద్వారా ప్రజలకు ధైర్యాన్ని నూరిపోశారు. 50 వ్యాసాలు ఉన్న ఈ సంకలనంలో కరోనాపై ప్రధానంగా దృష్టి సారించినప్పటికీ కనీస ఆరోగ్యం, సమకాలీన రాజకీయాలు, కుటుంబ జీవితం, మానవ విలువలు, సామాజిక మాధ్యమాలను అర్థవంతంగా వాడుకోవడం, అభివృద్ధి, నగరీకరణ తదితర అంశాలపై తన ఆలోచనలను పంచుకున్నారు, మంచిచెడులను లోతుగా విశ్లేషించారు. కొత్తకొత్త వ్యాధులు, వాతావరణ మార్పులు, సోషల్ మీడియా ప్రాబల్యం ఎక్కువవుతున్న సమయంలో ప్రజలకు దారిదీపాలుగా నిలిచేవి ‘ఓ వైద్యుడి వలపోత’ లాంటి పుస్తకాలే.
ఓ వైద్యుడి వలపోత
రచయిత: డా॥ రవిశంకర్ ప్రజాపతి
పేజీలు: 186, వెల: రూ. 200
ప్రచురణ: తెలుగు అసోసియేషన్ ప్రచురణలు
ప్రతులకు: డా. రవిశంకర్ ప్రజాపతి, ఇఎన్టి
స్పెషలిస్ట్, ప్రభుత్వ ఇఎన్టి వైద్యశాల, కోఠి,
హైదరాబాద్, తెలంగాణ
ఫోన్ నంబర్లు: 94407 68894, 62817 9535
భారతం చెప్పే లోకరీతి
మహాభారతంలో ధర్మం ప్రధానంగా సాగే విదురనీతి చాలామందికి పరిచయమే. కానీ, అంతగా తెలియని లోకరీతికి సంబంధించిన మరో నీతి ఒకటుంది. అదే కణిక నీతి. దీనినే కూటనీతి అనీ అంటారు. రాజు తన శత్రువులతో, పాలితులతో, మిత్రులతో, కుటుంబసభ్యులతో అనుక్షణం ఎంత జాగరూకతతో, అప్రమత్తంగా మెలగాలో, శత్రుశేషాన్ని ఎలా, ఎందుకు నిర్మూలించుకోవాలో తెలిపేదే కణిక నీతి. విదురనీతి ధర్మ
బద్ధంగా గెలవాలని చెప్తుంది. కణిక నీతి మాత్రం గెలవడమే ధర్మం అని స్పష్టం చేస్తుంది. ఇలాంటి రాజతంత్ర సారాన్ని సరళమైన తెలుగులో పరిచయం చేస్తూ ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాస గ్రంథాల రచయిత పాలకుర్తి రామమూర్తి రాసిందే ‘కణిక నీతి’. కణికుడు కురు సార్వభౌముడు ధృతరాష్ర్టుడి దగ్గర మంత్రి. రాజనీతి ధురంధరుడు. తన కుమారుల కంటే బలవంతులైన పాండవులను ఎలా వదిలించుకోవాలో సూచించమని ధృతరాష్ర్టుడు అడిగినప్పుడు కణికుడు వివరించిన కుటిల మంత్రాంగమే కణిక నీతిగా ప్రసిద్ధి చెందింది. అయితే, కుటిలం అంటున్నాం కాబట్టి దీనిని భారతంలో ధృత
రాష్ర్టుడు, దుర్యోధనుడు మాత్రమే అమలు చేశారనుకుంటే పొరపాటే అవుతుంది. తెలిసో, తెలియకుండానో ధర్మరాజు కూడా కణిక నీతినే ఆశ్రయించి భారత యుద్ధంలో విజయం సాధించాడు. ఈ పుస్తకం ప్రాధాన్యం రచయిత మాటల్లోనే చెప్పాలంటే… కొన్ని పుస్తకాలను మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటే, కణిక నీతి మాత్రం మనల్ని జాగరూకులుగా ఉంచుతుంది. ఇక శత్రువులు అంటే.. కేవలం మనుషులే కాదు, సమస్యలు కూడా. వర్తమాన రాజకీయాల్లోనూ కణిక నీతికి దృష్టాంతాలు గోచరమవుతాయి. ఈ పుస్తకం మన మస్తిష్క ప్రమాణాన్ని విస్తరించి, మనతో జీవితకాల సాహచర్యం చేస్తుంది. వ్యవహార జ్ఞానాన్ని పదునుపెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన రాజనీతి సూత్రాలు కణిక నీతి.
కణిక నీతి
రచయిత: పాలకుర్తి రామమూర్తి
పేజీలు: 192, వెల: రూ.125
ప్రచురణ: విజేత కాంపిటీషన్స్
ప్రతులకు: బండ్ల పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, బాగ్ అంబర్పేట్, హైదరాబాద్- 500013
ఫోన్ నంబర్లు: 040- 27429494, 27406336, 99632 93399
బుక్ షెల్ఫ్ ఏజ్డ్ బ్యాచిలర్స్ (మరో 24 కథలు)
రచయిత: ప్రతాప వెంకట సుబ్బారాయుడు
పేజీలు: 152, వెల: రూ.200
ప్రతులకు: 93939 81918
ఆకాశ వృక్షం (కవిత)
రచయిత: ఎ.వి.వీరభద్రాచారి
పేజీలు: 222, వెల: రూ.200
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు,
వీబీఎస్ పోయెట్రీ సర్కిల్, 93913 10886
నా కవితలలో నా ఆవేదన (ప్రసారిత, ప్రచురిత కవితల సంకలనం)
కృతికర్త: డా॥ దేశిరాజు
లక్ష్మీనరసింహారావు
పేజీలు: 101, వెల: రూ.99
ప్రతులకు: 99858 44558, 93904 36239
నాన్నే నా చిరునామా(దీర్ఘ కవిత)
రచయిత: అంబటి వెంకన్న
పేజీలు: 48, వెల: రూ.40
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలు జాబిలి
కళామండలి-నల్లగొండ, ఫోన్: 99663 76072