అందం, అభినయం కలబోసుకొన్నఅతికొద్దిమంది హీరోయిన్ల జాబితాలోనిత్యా మేనన్ పేరు తప్పకుండాఉంటుంది. కథా ప్రాధాన్యమున్నసినిమాల్లోనే నటిస్తూ, తనకంటూప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నదీ కన్నడ భామ. దాదాపు ఐదేండ్ల విరామం తర్వాత, ‘గమనం’ సినిమాతో పూర్తిస్థాయి పాత్రలోమరోసారి తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతున్నది నిత్యా మేనన్.ఈ సందర్భంగా ఆ ముద్దుగుమ్మ ముచ్చట్లు..
లాక్డౌన్లో సగటు మనిషిని ఆదుకునేందుకు ఓ ప్రత్యేక మార్గాన్నిఎంచుకుంది నిత్య. ఫ్యాషన్ షోలలో తాను ధరించిన డిజైనర్ డ్రెస్సులను వేలం వేయగా వచ్చిన డబ్బుతో, ఓ ఫౌండేషన్ ద్వారా
పలు గ్రామాల ప్రజలకు నిత్యావసరాలను అందించింది.
డబ్బు కోసం, అవకాశాల కోసం ఇష్టంలేని కథలను ఎంచుకొనే ప్రసకి ్త లేదని తొలినాళ్లలోనే ప్రకటించింది నిత్య. ఆ వడపోత కారణంగానే.. తెలుగు తెరపై అడుగుపెట్టి పుష్కరకాలం గడుస్తున్నా,హీరోయిన్గా సినిమాల జాబితా పాతికకు మించలేదు. సోషల్ మీడియాలో అభిమానులతో బోల్డ్గా బోలెడు విషయాలు చర్చిస్తుంది.
నిత్య ‘ది మంకీ హూ న్యూ టూమచ్’ అనే ఇంగ్లిష్ సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. మణిపాల్ యూనివర్సిటీలో జర్నలిజంలో డిగ్రీ చేసిన ఈ భామ మొదట్లో పాత్రికేయురాలు కావాలనుకుంది. కానీ వార్తలు రాసే వృత్తిలోకి రాకుండా, వార్తల్లో నిలిచే రంగంలో స్థిరపడింది.
“7 ఓ క్లాక్’ సినిమాతో 2006లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది నిత్యా మేనన్. ఆ తర్వాత నాలుగేండ్లకు ‘అలా మొదలైంది’తో తెలుగువారిని పలుకరించింది. మొదటి సినిమాతోనే
ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకొంది. తెలుగేనా..మలయాళ, కన్నడ, తమిళ చిత్రాల్లోనూ నటించి దక్షిణాదిన మంచి గుర్తింపును పొందింది.
‘గీత గోవిందం’, ‘ఎన్టీఆర్’ బయోపిక్లలో అతిథి పాత్రల్లోనూ అభిమానులను పలుకరించింది. ‘ఎన్టీఆర్’లో మహానటి సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది. దాదాపు ఐదేండ్లుగా టాలీవుడ్లో
పూర్తిస్థాయి పాత్రలో నటించని నిత్య, వరుస ప్రాజెక్టులతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
పవన్ కల్యాణ్, రానా నటిస్తున్న‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్లో పవన్ కల్యాణ్ భార్యగా నటిస్తున్నది నిత్య. స్కై ల్యాబ్ కథాంశంతో వండివారుస్తున్న సినిమాతోపాటు, పాన్ ఇండియా మూవీ ‘గమనం’లో ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. పెండ్లి గురించి ప్రస్తావిస్తే, ‘ఆ ఒక్కటి అడక్కండి ప్లీజ్’ అని తప్పించుకుంటుంది గడసరి నిత్యా మేనన్.