మనిషికి తానెవరో, తన గతమేదో కూడా గుర్తులేకుండా పోవడాన్ని మించిన శాపం లేదు. దురదృష్టవశాత్తు అల్జీమర్స్ తీవ్రమయ్యే దశలో ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి.
చికిత్సేలేని ఈ వ్యాధిని ముందుగా పసిగట్టగలిగితే, రుగ్మత నెమ్మదించేలా చూడవచ్చు. రకరకాల థెరపీల ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చు. కానీ సాధారణ మతిమరుపుగా మొదలయ్యే ఈ అవస్థను ముందుగా గమనించేదెలా? ఇందుకు లిథువేనియా పరిశోధకులు ఓ పరిష్కారాన్ని కనుగొన్నట్టే ఉన్నారు. fMRI అనే ప్రక్రియతో మెదడుని చిత్రీకరించి, కృత్రిమ మేధస్సు ద్వారా విశ్లేషించే ప్రయత్నం చేశారు. 138 మంది అభ్యర్థులపై ఈ పరీక్ష చేశాక… వారిలో అల్జీమర్స్ ప్రమాదాన్ని 99 శాతం ముందుగానే పసిగట్టేసిందీ పరీక్ష. సాధారణ మతిమరుపులా కనిపించే ఈ పరిస్థితి నిజంగా ప్రమాదరహితమేనా, లేకపోతే అల్జీమర్స్కు సూచనా? అన్న విషయం తేల్చేసింది.