వినాయక చతుర్థినాడు చంద్రుని చూడరాదు. పొరపాటున చూస్తే విష్ణుపురాణంలోని ఈ కింది శ్లోకాన్ని చదువుకుంటే ఆ దోషం తొలగిపోతుందని నిర్ణయ సింధులో పేర్కొని ఉంది.
సింహః ప్రసేన మవధీత్ సింహోజాంబవతా హతః
సుకుమారక మారోదీః తవ హ్యేషస్స్య మంతకః
ధూపం
దశాంగం గుగ్గులోపేతం సుగంధం
సుమనోహరం ఉమాసుత
నమస్తుభ్యం గృహాణవరదోభవ
ఓం శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః
ధూపమాఘ్రాపయామి
దీపం
సాజ్యంత్రివర్తి సంయుక్తం
వహ్నినాద్యోతితం
మయా గృహాణ మంగళం దీపం
ఈశపుత్ర నమోస్తుతే
ఓం శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః
దీపం దర్శయామి
నైవేద్యం
ఉండ్రాళ్లు, కొబ్బరికాయ వంటి మహానైవేద్యం చూపించాలి. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
నైవేద్యంపై పుష్పంతో వీళ్లు చల్లాలి.
ఓం సత్యంత్వర్తేన పరిషంచయామి (నైవేద్యం చుట్టూ నీళ్ళు చల్లాలి) ఓం అమృతమస్తు (స్వామివారి దగ్గర నీళ్లు చల్లాలి) ఓం అమృతోపస్తరణమసి అని నైవేద్యం చుట్టూ మళ్లీ నీళ్లు చల్లి ఎడమ చేతితో కుడిచేతిని పట్టుకుని కింది శ్లోకాన్ని, మంత్రాలను చదువుతూ కుడిచేతితో అయిదుసార్లు నైవేద్యాన్ని స్వామివారికి చూపించాలి.
ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా.. మధ్యేమధ్యే పానీయం సమర్పయామి (నీళ్లు సమర్పించాలి)
అమృతాపిథానమసి. ఉత్తరాపోశనం సమర్పయామి (నీళ్లు చిలకరించాలి) హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి అంటూ నీళ్లు చల్లాలి.
తాంబూలం
తాంబూలాన్ని స్వామివారికి సమర్పించాలి.
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః తాంబూలం సమర్పయామి
పుష్పం
ఓం శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః సువర్ణ పుష్పం సమర్పయామి
నీరాజనం
సమ్రాజంచ విరాజంచ అభిశ్రీః
యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రయాముకే
తయామాసగ్ం సృజామసి సంతత
శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు
నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు
శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః నీరాజనం సమర్పయామి
పుష్పంతో హారతి పళ్లెంపై నీళ్ళు చల్లి హారతిని అందరూ కండ్లకు అద్దుకోవాలి. నీరాజన అనంతరం… శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారిపై పువ్వుతో నీళ్ళు చిలకరించాలి.