Zahir Khan | శ్రేయాస్ అయ్యర్తో సహా పలువురు ఆటగాళ్లు గాయాలబారినపడ్డారు. సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడు వన్డేల్లో విఫలమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియా పరిస్థితి 2019 వన్డే ప్రపంచకప్ నాటికి వచ్చిందని వ్యాఖ్యానించాడు. నాలుగేళ్ల క్రితం కూడా నాలుగో నంబర్ స్థానానికి శాశ్వత బ్యాట్స్మెన్ను టీమిండియా నానా తంటాలు పడిందని, 2019 ప్రపంచ కప్ టోర్నమెంట్లో జట్టు సెమీ ఫైనల్ను దాటలేకపోవడానికి ఇది ఓ కారణమని అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ భారత్లో జరుగనున్నది. ఈ క్రమంలో టోర్నీకి ఆథిత్యం ఇవ్వనున్న భారత్ ఇప్పుడు నాలుగోస్థానంపై పునరాలోచన చేయాలని సూచించాడు.
సూర్యకుమార్ యాదవ్పై టీమిండియా భారీగానే ఆశలు పెట్టుకున్నది. జట్టులో నెంబర్ ఫోర్లో వచ్చే శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో సూర్యకుమార్ అవకాశం వచ్చింది. అయితే, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో దారుణం విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేల్లో వరుసగా మూడు గోల్డెన్ డక్లు సాధించాడు. దీంతో నాలుగో స్థానం బ్యాటింగ్ విషయంలో మరోసారి టీమిండియాకు తలనొప్పిగా మారింది. శ్రేయాస్ గాయపడగా.. ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితుల్లో మరో ఆడగాడిని ఎంపిక చేయాల్సి ఉంది.
బ్యాటింగ్ ఆర్డర్పై జట్టు మేనేజ్మెంట్ ఖచ్చితంగా పునరాలోచన చేయాల్సిన విషయమన్నాడు. 2019 ప్రపంచకప్లోనూ ఇదే అంశం చర్చనీయాంశమైందని చెప్పాడు. నాలుగేళ్ల తర్వాత కూడా అదే మాట మాట్లాడుతున్నామని, ప్రస్తుతం అదే పడవలో ఉన్నామన్నాడు. శ్రేయాస్ అయ్యర్ రెగ్యులర్ నంబర్ వన్ బ్యాట్స్మెన్. ఆ స్థానంలో శ్రేయాస్ బాధ్యతలు చూస్తున్నాడు. ఎక్కువ రోజులు గాయం కారణంగా కోలుకోలేని పరిస్థితి ఉంటే.. ఇందుకు సమాధానం వెతకాలి. పేలవమైన ప్రదర్శన ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియాతో జరిగిన మూడో నిర్ణయాత్మక వన్డేలో ఓటమి తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో సూర్యకుమార్కు మద్దతు తెలిపాడు. సిరీస్లో మూడు మ్యాచ్ల్లో మూడు బంతులు మాత్రమే ఆడాడని, నిజం చెప్పాలంటే మూడు మంచి బంతులని చెప్పాడు. స్పిన్ను బాగా ఆడగలడని, ఏళ్లుగా చూస్తూ వస్తున్నామన్నాడు.