న్యూఢిల్లీ: ఈ ఏడాది ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో యోగాసనను కూడా చేర్చామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. యోగాను పోటీ క్రీడగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. లోక్సభలో యోగా అంశం పై ఎదురైన ఓ ప్రశ్నకు రిజిజు గురువారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బాలుర, బాలిక విభాగాల్లో యోగాసన ఉంటుందని స్పష్టం చేశారు.