వకీల్సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్కల్యాణ్ మాట్లాడుతూ..నేను సంగీతప్రియుణ్ణి..ఖుషీ సినిమా అయిపోయిన తర్వాత చాలా కాలం సినిమాలు చేయలేదు. ఆ టైంలో ఏమేం చేశానంటే..ఒకటి వ్యవసాయం చేశాను. రెండు కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. జంట స్వరాల దాకా వయోలిన్ వాయించేవాడిని.
నాకు సంగీతం పట్ల అంత మక్కువ. అంత గౌరవం. అలాంటి కర్ణాటక సంగీతం నేపథ్యంలో ఈవెంట్ మగువా మగువా పాట చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. శివమణి నా అభిమాని అని నన్ను పిలిచి డ్రమ్స్ వాయించే వరకు నాకు తెలియలేదు. ఈయన సాక్షాత్తు శివ స్వరూపం. శివుడి ఢమరుకం ఎలా ఉద్భవిస్తుందో తెలియదు కానీ..ఈయనను చూస్తే ఆ శివ నాదం అణువణువునా బయటకు వస్తుంది.
ఆ శివస్వరూపానికి, సరస్వతి స్వరూపానికి మీ అందరి తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. సినిమా చేస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది. సినిమా అనేది డబ్బులు సంపాదించడానికి మాత్రమే కాదు..పది మంది ఉపాధి కోసం కూడా అని పవన్ కల్యాణ్ అన్నాడు.