మస్కట్: యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (59 బంతుల్లో 75; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో ఒమన్తో జరిగిన రెండో టీ20లో ముంబై జట్టు విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన రెండో టీ20లో ముంబై 18 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేసింది. యశస్వితో పాటు అమన్ ఖాన్ (15 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అర్మాన్ జాఫర్ (20) రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. అనంతరం కెప్టెన్ షమ్స్ ములానీ (3/12), నాయక్ (2/10) బౌలింగ్లో విజృంభించడంతో ఒమన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. జతిందర్ సింగ్ (51) అర్ధశతకం సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు.