టోక్యో: అంతర్జాతీయ టోర్నీల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన భారత రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్ విశ్వక్రీడల సమరానికి సన్నద్ధమయ్యారు. టోక్యో ఒలింపిక్స్లో రెజ్లింగ్ మంగళవారం ప్రారంభం కానుండగా.. భారత పోరును 19 ఏండ్ల అమ్మాయి సోనమ్ మాలిక్ (62 కేజీలు) మొదలుపెట్టనుంది. మన దేశం నుంచి ఏడుగురు రెజ్లర్లు బరిలో ఉండగా. కనీసం మూడు పతకాలు పక్కా అన్న అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆసియా చాంపియన్లు బజరంగ్ (65 కేజీలు), మహిళా స్టార్ వినేశ్ ఫోగట్ (53 కేజీలు)తో పాటు రవి దహియా (57 కేజీలు)పై ఆశలున్నాయి. మంగళవారం తొలిపోరులో బోలోర్తుయా కులేల్కు (మంగోలియా)తో సోనమ్ తలపడనుంది.