ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు తొలిసారిగా దాదాపు 1.20 లక్షల మిర్చి బస్తాలను రైతులు అమ్మకానికి తీసుకొచ్చారు. పదిహేను రోజులుగా మార్కెట్కు అంచెలంచెలుగా పంట తాకిడి పెరుగుతోంది. బుధవారం ఖమ్మం జిల్లా రైతులతోపాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఏపీలోని కృష్ణా జిల్లాల రైతులు రికార్డు స్థాయిలో పంటను తీసుకొచ్చారు.
పొరుగు జిల్లాల్లో మిర్చి క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోవడంతో ఆ ప్రభావం ఖమ్మం ఏఎంసీపై పడుతోంది. ఒకే రోజు ముందుగానే (మంగళవారం) రాత్రి వేళలోనే సుమారు 50 వేల బస్తాలు వచ్చాయి. బుదవారం ఉదయం జెండాపాట సమయానికి గాను మరో 70 వేల బస్తాలు చేరుకున్నాయి.
పంట భారీగా రావడంతో మిర్చి యార్డుతోపాటు పత్తి యార్డులో సైతం దిగుమతికి అధికారులు అనుమతి ఇచ్చారు. అనంతరం జెండాపాటలో గరిష్ఠ ధర క్వింటాకు రూ.14,300 చొప్పున కొనుగోలు చేశారు. లాక్డౌన్ వదంతులతో రైతులు పంటను భారీగా తీసుకొస్తున్నారు.
కాగా, ఈ నెల 30న జరుగనున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ బూత్లను మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేయడంతో 29, 30 తేదీల్లో క్రయవిక్రయాలు నిలిచిపోనున్నాయి. మే1న మేడే కావడంతో సాధారణ సెలవు ఉంటుంది. మే 2న నుంచి క్రయవిక్రయాలు జరుగుతాయి.
ఇవి కూడా చదవండి..
ప్రాణం పోసిన దవాఖానలో.. మొక్కను నాటిన మహిళ
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు చేయండి
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ మృతిపట్ల మంత్రి వేముల సంతాపం
కొనుగోలు కేంద్రాలతోనే రైతులకు మేలు