ప్రపంచ మహిళల చెస్ చాంపియన్షిప్
న్యూఢిల్లీ: ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్షిప్ను భారత జట్టు ‘డ్రా’తో ప్రారంభించింది. స్పెయిన్ వేదికగా జరుగుతున్న ఈ మెగాటోర్నీలో పూల్-‘ఎ’ నుంచి బరిలోకి దిగిన భారత్.. అజర్బైజాన్తో తొలి రౌండ్ను ‘డ్రా’ చేసుకుంది. తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక, వైశాలి విజయాలు సాధించారు. తొలి బోర్డులో మమ్మద్జదాపై హారిక 34 ఎత్తుల్లో గెలుపొందగా.. నాలుగో బోర్డులో వైశాలి 60 ఎత్తుల్లో గుల్నార్ను చిత్తుచేసింది. తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణి పరాజయాలు పాలవడంతో భారత్ తొలి రౌండ్ను 2-2తో ‘డ్రా’ చేసుకుంది. రెండో రౌండ్లో స్పెయిన్తో మన అమ్మాయిలు తలపడనున్నారు.