ఇచ్చోడ, సెప్టెంబర్ 29: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండివాగు సమీపంలోని గాయత్రి జలపాతం.. వరల్డ్ వాటర్ రాపెల్లింగ్ పోటీలకు వేదిక కాబోతున్నది. తెలంగాణ అడ్వంచర్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్ర, శనివారాల్లో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఒకవేళ వర్షం కురిస్తే మరుసటి రోజు క్రీడలను నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర అడ్వెంచర్ క్లబ్ డైరెక్టర్ కే రంగారావు తెలిపారు. రాపెల్లింగ్ పోటీలకు 350 అడుగుల ఎత్తు కలిగిన జలపాతం అవసరమని, గాయత్రి జలపాతం ఇందుకు అనుకూలంగా ఉండడంతో ఎంపిక చేశామన్నారు. 4 రోజుల పాటు మేడిగూడ గిరిజన ఆశ్రమ పాఠశాలలో సాహసికులకు వసతి ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.