తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి జులై నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ జూన్ 22న, మంగళవారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనుంది. రోజుకు 5 వేల చొప్పున టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. కాగా, జులై నెలకు సంబంధించిన గదుల కోటాను జూన్ 23న బుధవారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఆన్లైన్లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ పేర్కొంది.