హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇటలీ వేదికగా జరిగే ప్రపంచ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ కోసం బుధవారం భారత జట్టును ఎంపిక చేశారు. జాతీయ రోలర్ స్కేటింగ్ సమాఖ్య ప్రకటించిన పురుషుల సీనియర్ ఇన్లైన్ హాకీ టీమ్లో తెలంగాణ నుంచి నలుగురు ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. వీరిలో ఆర్యన్, చిరాగ్, శ్రీమన్, శివ ఉన్నారు.