జోగులాంబ గద్వాల : అంబులెన్స్లోనే ఓ కరోనా బారిన పడిన గర్భిణికి అంబులెన్స్ సిబ్బంది సుఖ ప్రసవం చేశారు. జిల్లాలోని ధరూర్ మండలం వానపల్లి గ్రామానికి చెందిన ఓ గర్భిణి ఇటీవల కరోనా పాజిటివ్గా నమోదైంది. కాగా, గురువారం ఆ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 ఆంబులెన్స్ లో గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
మార్గమధ్యంలో 108 ఆంబులెన్స్ లోనే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో సిబ్బంది ఆమెకు డెలివరీ చేశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని 108 సిబ్బంది ఈఎన్టీ శ్రీనివాసులు, పైలెట్ నాగరాజు, గద్వాల 108 కోఆర్డినేటర్ రాఘవేంద్ర తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సీఎం కేసీఆర్ వెంటే మంథని ప్రజలు
హ్యాట్సాఫ్ కోహ్లి.. ఐపీఎల్ వాయిదా పడగానే కొవిడ్ సహాయక చర్యల్లో కెప్టెన్
అజిత్ సింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం