జైపూర్: క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు జాతీయ స్థాయిలో హ్యాండ్బాల్ ప్రీమియర్ లీగ్ నిర్వహించనున్నట్లు భారత హ్యాండ్బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్రావు వెల్లడించారు. గురువారం జైపూర్ వేదికగా జరిగిన హెచ్ఎఫ్ఐ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పురుషుల హ్యాండ్బాల్ లీగ్ నిర్వహణ హక్కులు దక్కించుకున్న ‘ది బ్లూ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్’ సంస్థనే మహిళల హ్యాండ్బాల్ లీగ్ను కూడా నిర్వహించనుందని జగన్మోహన్రావు తెలిపారు.