న్యూఢిల్లీ: మూడు జట్లతోనే ఈ ఏడాది మహిళల టీ20చాలెంజ్ టోర్నీ (మహిళల ఐపీఎల్) నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నది. నాలుగు జట్లతో లీగ్ నిర్వహిద్దామనుకున్నా.. కరోనా వైరస్ కారణంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. కొవిడ్-19 విజృంభణతో పురుషుల ఐపీఎల్ గతేడాది యూఏఈ వేదికగా జరుగగా.. ఆ లీగ్ ప్లేఆఫ్స్ సమయంలో మహిళల టోర్నీ నిర్వహించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో మహిళల బిగ్బాష్ జరుగడంతో ఆస్ట్రేలియా ప్లేయర్లు టీ20 చాలెంజ్కు దూరమయ్యారు. ఈసారి అలాంటి సమస్య లేకుండా లీగ్కు రూపకల్పన చేసేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా ఈనెల 16న జరిగే బోర్డు అపెక్స్ కౌన్సిల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.