న్యూఢిల్లీ: కరోనా విజృంభిస్తుండడంతో ఈ ఏడాది మహిళల టీ20 చాలెంజ్ (మహిళల ఐపీఎల్) రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరస్ ప్రభావం విపరీతంగా పెరుగుతుండడం, వివిధ దేశాలు ప్రయాణ ఆంక్షలు విధించడంతో విదేశీ ప్లేయర్లు భారత్కు రావడం కష్టమని, అందుకే టోర్నీ జరుగకపోవచ్చని బుధవారం బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. భారత ప్లేయర్లకు ఇప్పటికే క్యాంపు నిర్వహించాలని బీసీసీఐ భావించినా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ క్రికెటర్లు టోర్నీలో ఆడేందుకు ఇక్కడికి వచ్చే పరిస్థితులు లేవు. దీంతో రద్దుకే బీసీసీఐ మొగ్గుచూపుతున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. గతేడాది పురుషుల ఐపీఎల్ ప్లేఆఫ్స్ సమయంలో యూఏఈ వేదికగానే మూడు జట్లతో మహిళల టీ20 చాలెంజ్ జరిగిన సంగతి తెలిసిందే.