పుణె: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో మహిళల జాతీయ బాక్సింగ్ క్యాంప్ను పుణెకు తరలించాలని భారత బాక్సింగ్ సమాఖ్య యోచిస్తున్నది. పాటియాలతో పోలిస్తే పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ (ఏఎస్ఐ)లో కఠిన నిబంధనల మధ్య శిబిరం నిర్వహించాలని భావిస్తున్నది. ఈ క్యాంప్లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్, సిమ్రన్జీత్ కౌర్, లవ్లీనా బొర్గొహైన్ సహా మొత్తం పది మంది బాక్సర్లు పాల్గొననున్నారు. శిబిరం అనంతరం టోక్యో ఒలింపిక్స్లో పాల్గొననున్న బాక్సర్లు నేరుగా పుణె నుంచి విశ్వక్రీడలకు బయలుదేరనున్నట్లు సమాచారం.