హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎమ్) ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండానే వచ్చే నెల 11కు వాయిదా పడింది. ఆదివారం ఉప్పల్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో అంబుడ్స్మెన్ నియామకం సహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నూతన క్లబ్ల ఏర్పాటు, మైదానాల రూపకల్పనపై చర్చ జరిగింది. అయితే సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఏజీఎమ్ను వాయిదా వేశారు.