టిప్పర్ ఢీకొని ముగ్గురు విద్యార్థులు మృతి
హాలియా, ఏప్రిల్ 2: స్టడీ మెటీరియల్ కోసం బైక్పై కాలేజీకి వెళ్తున్న ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు టిప్పర్ ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం నడ్డివారిగూడెంకు చెందిన నడ్డి శ్రీకాంత్(18), పెద్దవూర మండలం చింతపల్లికి చెందిన శివ (18), అనుముల మండల కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి మహేశ్ (18) నల్లగొండలోని గౌతమి జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఇంటి వద్దే ఉండి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. కళాశాల యాజమాన్యం స్టడీ మెటీరియల్ ఇస్తామని చెప్పడంతో ముగ్గురు శుక్రవారం బైక్పై నల్లగొండకు బయలుదేరారు. అనుముల మండలం చింతగూడెం స్టేజీ వద్ద ఎదురుగా వచ్చిన టిప్పర్ వీరిని ఢీకొట్టడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు.
ఇవి కూడా చదవండి..
కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
భారం కావొద్దని.. వృద్ధ దంపతులు
ఆడుకొనేందుకు వెళ్లి అగ్నికి ఆహుతి
అన్నప్రాసనకు వెళ్తూ.. అనంతలోకాలకు
పుచ్చకాయ తిని అన్నదమ్ములు మృతి
కేసీఆర్ ఆపద్బంధు బీసీల బంధువు
స్కౌట్స్, గైడ్స్ చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కవిత
రూ.8.4 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం