టోక్యో: ఆడుతున్న తొలి ఒలింపిక్స్లోనే మెడల్ ఖాయం చేసుకుంది ఇండియన్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్. 69 కేజీల కేటగిరీలో శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్ బౌట్లో గెలిచి సెమీస్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక సెమీస్ బౌట్ ఫలితంతో సంబంధం లేకుండా లవ్లీనాకు కనీసం బ్రాంజ్ మెడల్ ఖాయమైంది. అయితే తాను మాత్రం గోల్డ్ మెడలే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ చారిత్రక విజయం తర్వాత లవ్లీనా చెప్పింది. ఈమె చేతిలో నాలుగుసార్లు ఓడిపోయాను. ఆమె అంటే భయం లేదు అని నిరూపించాలనుకున్నాను. నేను కేవలం ప్రతీకారం కోసమే ఎదురుచూశాను అని లవ్లీనా చెప్పడం విశేషం.
ఈ బౌట్ను బాగా ఎంజాయ్ చేశాను. స్వేచ్ఛగా ఆడాను. వ్యూహం, ప్రణాళిక ఏమీ లేవు. ఆమె గురించి నాకు ముందు నుంచీ తెలుసు. అందుకే ప్లాన్ కూడా అవసరం లేదు. ఈ బౌట్లో నేను అసలు ఒత్తిడి తీసుకోకపోవడం కీలకమైన విషయం అని లవ్లీనా చెప్పింది. ఈమె వచ్చే నెల 4న జరగబోయే సెమీస్లో వరల్డ్ చాంపియన్, టర్కీ బాక్సర్ బుసెనాజ్ సూర్మెనెలితో తలపడనుంది. ఇప్పుడు దొరికిన సమయంలో ఆమె వీడియోలు చూసి ఎలా ఆడాలో నిర్ణయిస్తాను అని లవ్లీనా చెప్పింది.
ఇప్పుడే ఏం చెప్పాలి. ఫైనల్ తర్వాత నాకు సపోర్ట్ చేసిన వాళ్లకు థ్యాంక్స్ చెబుతాను. మెడల్ అంటే గోల్డ్ మెడలే. ముందు దాన్ని గెలవనీయండి అని లవ్లీనా అనడం విశేషం. ఇండియాకు టోక్యో ఒలింపిక్స్లో మరో మెడల్ ఖాయం చేసిన లవ్లీనాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అస్సాం రాష్ట్రం ఇప్పటికే ఆమెకు రూ.50 లక్షల నగదు బహుమతి ప్రకటించింది.