వనపర్తి, జూన్ 8 : పట్టణంలోని ప్రభుత్వ స్థలంలో అడు గు స్థలం కూడా కబ్జా కానివ్వమని మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని రాజీవ్ గృహకల్ప పక్కన గల కుంట స్థలాన్ని ఆయన కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు నాయకులు రాజీవ్ గృహకల్ప కుంట అన్యాక్రాంతం అవుతున్నదనే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, వాటిలో నిజం లేదన్నారు. అక్కడి ప్రజల అవసరం దృష్ట్యా పార్కు ఏర్పాటు చేయడానికి చదును చేశామని , అదేవిధంగా ముళ్లపొదల్లో పాములు సంచరిస్తున్నాయని ప్రజల కోరిక మేరకు కంపచెట్లను తొలగించామని వివరించారు. గత 20 ఏండ్లుగా కౌన్సిలర్గా పని చేస్తున్నానని తన గురించి పట్టణ ప్రజలకు పూర్తి స్థాయిలో తెలుసునని అనవసరపు ఆరోపణలను మానుకోవాలని ఆయన హితవు పలికారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు పాకనాటి కృష్ణ, బండారుకృష్ణ, పుట్టపాకుల మహేశ్, చీర్ల సత్యం, భాష్యనాయక్, కంచె రాఘవేంద్ర, నాయకులు కృష్ణయ్య, శరవంద, శేఖర్యాదవ్, పరంజ్యోతి పాల్గొన్నారు.