దుబాయ్: టీ20 ప్రపంచకప్లో మరో ఆసక్తికర సమరానికి తెరలేచింది. మంగళవారం నాడు సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా సారధి టెంబా బవుమా మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ను పక్కనపెట్టారు.
అతని స్థానంలో హెన్నిక్ క్లాసెన్ను తీసుకున్నారు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు దక్షిణాఫ్రికా ఆటగాళ్లంతా ఒక మోకాలిపై కూర్చోవాలని సైతాఫ్రికా క్రికెట్ బోర్డు మార్గదర్శకాలు విడుదల చేసింది. టీ20 ప్రపంచకప్లో దాదాపు అన్ని జట్లూ ఈ సంస్కృతిని ఫాలో అవుతున్నాయి. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి మద్దతుగా ఇలా ఒక మోకాలిపై ఆటగాళ్లు కూర్చుంటున్న సంగతి తెలిసిందే.
ఇంగ్లండ్తో జరిగిన గత మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు స్వల్పస్కోరుకే ఆలౌట్ అయింది. భారీ హిట్టర్లున్న ఈ టీమ్ ఇలా 55 పరుగులకే ఆలౌట్ అవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి టీ20 ప్రపంచకప్లో ముందుకెళ్లాలని విండీస్ భావిస్తోంది.