యాదాద్రి, ఏప్రిల్ 28 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బుధవారం నిత్య పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. అర్చకులు వేకువజామునే స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసీ అర్చనలు జరిపారు. అనంతరం లక్ష్మీనరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి సుదర్శన నారసింహ హోమం అనంతరం నిత్య తిరు కల్యాణ వేడుకలు ఆగమశాస్త్ర రీతితో నిర్వహించారు. స్వామి వారి అలంకార సేవోత్సవాలతో పాటు అష్టోత్తరంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకు న్నారు. ప్రతీరోజూ ఒక్కో రకమైన పూజలు నిర్వహిస్తూ భక్తులు లక్ష్మీనృసింహుడిని కొలుస్తున్నారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతు న్న నేపథ్యంలో స్వామివారి దర్శించుకునే భక్తుల సంఖ్య తగ్గింది. పరమితి సంఖ్యలో భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిత్య కల్యాణంలో పాల్గొన్నారు.
ఖజానాకు రూ. 1,34,685 ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి రూ. 1,34,685 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 6,248, రూ. 100 దర్శనాల తో రూ. 1,700, క్యారీ బ్యాగులతో రూ. 825, వ్రతాలతో రూ. 2,000, కల్యాణకట్టతో రూ. 8,400, ప్రసాద విక్ర యాలతో రూ. 80,140, వాహన పూజలతో రూ. 2,200, టోల్గేట్ ద్వారా రూ. 400, సువర్ణపుష్పార్చనతో రూ. 12,236, యాదరుషి నిలయంతో రూ. 9,100, శివాల యం ద్వారా రూ. 716, పాతగుట్టతో రూ. 1,720, టెం కాయల విక్రయాలతో రూ. 9,000 తో కలిపి స్వామి వారి కి రూ. 1,34,685 ఆదాయం సమకూరింది.