హైదరాబాద్ : సీఎం కేసీఆర్ గొప్ప దైవభక్తుడని, ఉమ్మడి రాష్ట్రంలో నిరాధరణకు గురైన మన ఆలయాలను గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాలలోని ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధిపై మంత్రి హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ యాదాద్రిని దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారని, వేములవాడ, ధర్మపురి దేవస్థానాలను కూడా గొప్పగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేశారన్నారు.
ధర్మపురి లక్ష్మీ నరసింహా స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులను భక్తి ప్రపత్తులు, శ్రద్ధాసక్తులతో చేపట్టి అద్భుతంగా తీర్చిదిద్దాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి దేవస్థానం పునః నిర్మాణం, విస్తరణ, అభివృద్ధికి సీఎం రూ. 120కోట్లు కేటాయించగా ఇందులో మొదటి విడతగా రూ.61 కోట్ల 66లక్షలు విడుదలయ్యాయని వివరాలను వెల్లడించారు.
ఆలయం అభివృద్ధికి సంబంధించిన నమూన, ప్రతిపాదనలు, ప్రణాళిక, చేపట్టిన, చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులు మంత్రికి వివరించారు.
సమావేశంలో దేవాదాయ శాఖ ఈఈ రాజేష్, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, డీఈ రఘునందన్, అసిస్టెంట్ స్థపతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా పరీక్షల కోసం వచ్చి.. కన్నుమూశాడు
నేల తల్లి బాగుంటేనే భవిష్యత్తు : మంత్రి ఐకే రెడ్డి
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఒకే దేశంలో వ్యాక్సిన్కు రెండు ధరలా?