హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్(అంకుర పరిశ్రమలు)లను ప్రోత్సహించేందుకు టీ-హబ్ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. కరోనా మహమ్మారి కారణంగా అతలాకుతలమైన అంకుర పరిశ్రమలను ఆదుకునేందుకు టీ-హబ్, స్టార్టప్ల ఫండింగ్ కోసం టీ-ఏంజిల్ను గురువారం ప్రారంభించింది. అర్హత కలిగిన అంకుర పరిశ్రమలకు టీ-ఏంజిల్ ద్వారా రూ. 50 లక్షల వరకు ఏంజిల్ ఇన్వెస్టర్లు ఆర్థిక సాయం చేస్తారు.
టీ ఏంజిల్ ద్వారా ఆర్థిక సాయం పొందాలనుకునే స్టార్టప్లు నేటి నుంచి జూన్ 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 45 రోజుల్లో దరఖాస్తులను పరిశీలించి 15 నుంచి 20 అంకుర పరిశ్రమలను ఎంపిక చేసి, వాటికి టీ-ఏంజిల్ ద్వారా ప్రోత్సహకాలు కల్పించనున్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా, దేశ వ్యాప్తంగా ఉన్న స్టార్టప్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.