నిజామాబాద్ : ఆర్మూర్ పట్టణ సమీపంలోని పెర్కిట్ శివారులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. 63వ నంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు పెట్రోల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టడంతో ప్రమాదంలో డ్రైవర్తో సహా 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సు కరీంనగర్ నుంచి ఆర్మూర్ వైపు వెళ్తున్నది. ఈ క్రమంలో ట్యాంకర్ను బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడ్డ ప్రయాణికులను నిజామాబాద్, ఆర్మూర్ ఆసుపత్రులకు తరలించారు. ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.