కమాన్చౌరస్తా, ఏప్రిల్ 3: యువతలో స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపేందుకే ఆజాదీకా అమృత మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆజాదీకా అమృత మహోత్సవాల్లో భాగంగా శనివారం కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణలో కవులకు పుట్టినిల్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అని, వేములవాడలో జన్మించిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సీ నారాయణరెడ్డి ఆణిముత్యం లాంటి గొప్ప కవి అని కొనియాడారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ, కవులకు, కళాకారులకు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని, ఈ కవి సమ్మేళనంలో కవుల కవితలతో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని నింపాలన్నారు. అనంతరం సుమారు 30 మంది కవులు సమ్మేళనంలో పాల్గొని స్వాతంత్య్రోద్యమంపై తమ కవితలను వినిపించారు. సీపీ కమలాసన్రెడ్డి, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్, మెప్మా పీడీ రవీందర్, కవులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
హిమంత శర్మపై 48 గంటల నిషేధం.. గౌహతి హైకోర్టులో అపీల్
నక్సల్స్ పెట్టిన మందపాతరను నిర్వీర్యం చేసిన CRPF.. వీడియో