భీమారం, ఏప్రిల్ 5: బాబూ జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకుని సోమవారం కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి కుడా డైరెక్టర్ చిర్ర రాజుగౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ వెంక ట గోపీనాథ్, డాక్టర్ చీకటి శ్రీను, మేడారం సుధాకర్, మాలమహానాడు సంఘం ప్రెసిడెంట్ బందెల రాజేశ్ ఖన్నా పాల్గొన్నారు.
57వ డివిజన్లో..
గ్రేటర్ వరంగల్ పరిధి 57వ డివిజన్ హనుమాన్నగర్ జంక్షన్లో బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాలనీ వాసులు మొట్ల మనోహర్, వలస సారంగం, కే శ్రీనివాస్రెడ్డి, సాధుల రఘుపతి, సంతోష్, రాజ్కుమార్, వెంకటేశ్, శ్రావణ్, రవి, కిరణ్ పాల్గొన్నారు.
మడికొండలో..
మడికొండ: కాజీపేట బాపూజీనగర్ చౌరస్తాలో అరుంధతి మాదిగ కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు సిలువేరు విజయభాస్కర్ ఆయన సేవలను కొనియాడారు. సంఘం కార్యవర్గ సభ్యులు దుప్పటి శికుమార్, జెర్రిపోతుల వెంకటేశ్వర్లు, సల్లూరి నాగేశ్వర్రావు, భాషపాక శ్రీనివాస్, బరిగెల వినయ్, రేణికుంట్ల ఉమామహేశ్, కాళేశ్వరి సుదర్శన్, విజయ్, ఇంద విజయ్రావు, నవీన్, అర్చన, మాలతి, లలిత, మంజుల, అనసూయ, శ్రావణి, అమృత పాల్గొన్నారు.
కాజీపేటలో జయంత్యుత్సవాలు
కాజీపేట: కాజీపేట, విష్ణుపురి చౌరస్తాల్లో టీఆర్ఎస్ నాయకులు గబ్బెట శ్రీనివాస్, యాకూబీ ఆధ్వర్యంలో వేర్వేరుగా జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నార్లగిరి రమేశ్, మహ్మద్ అంకూస్ పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడువాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ సోనీ, పాలడుగుల రామస్వామి, కొండ్ర శంకర్, బరిగెల వినయ్, దువ్వ నరేశ్, మాజీ కార్పొరేటర్లు రావుల సదానందం, సుంచు అశోక్, మర్యాల కృష్ణ, శ్రీకాంత్, శేఖర్, శ్రీనివాస్, సాధిక్, ఇంద విజయ్రావు, రాబర్ట్, జోసఫ్ పాల్గొన్నారు.
ఆర్టీసీ ఆర్ఎం ఆఫీస్లో..
హన్మకొండ చౌరస్తా : హన్మకొండలోని ఆర్టీసీ ఆర్ఎం ఆఫీస్లో ఆర్ఎం ఎస్వీజీ కృష్ణమూర్తి జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జగ్జీవన్రామ్ను ఆదర్శంగా తీసుకు ని ఆర్టీసీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్లు వీ శ్రీదేవి, టీ శ్రీనివాసరావు, డిపో మేనేజర్ కే భానుకిరణ్, పర్సనల్ ఆఫీసర్ పీ శ్రీనివాసరావు, డీఈఈ వీ బుచ్చయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మధ్యవర్తికి రూ.10 కోట్ల కమిషన్
శత్రు క్షిపణులను దారి మళ్లించే చాఫ్