న్యూఢిల్లీ: బాక్సింగ్ ప్రియులకు శుభవార్త. భారత్లో తొలిసారి ప్రొఫెషనల్ బాక్సింగ్ చాంపియన్షిప్నకు వేళైంది. వచ్చే నెల 1న జలంధర్లో ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్(డబ్ల్యూబీసీ) ఇండియా చాంపియన్షిప్ జరుగనుంది. చాందినీ మెహ్రా, సుమన్ కుమారి మధ్య బౌట్ జరుగుతుందని నిర్వాహకులు మంగళవారం పేర్కొన్నారు. ప్రపంచంలోనే ప్రముఖమైన నాలుగు ప్రొఫెషనల్ బాక్సింగ్ లీగ్ల్లో ఒకటైన డబ్యూబీసీ దేశంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టే అవకాశముందని ఎల్జెడ్ ప్రమోషన్స్ సీఈవో పరమ్ గోరయా తెలిపాడు. ఈ టోర్నీ..పురుషుల, మహిళల ప్రొఫెషనల్ బాక్సింగ్కు గేమ్ చేంజర్గా మారుతుందని ఆయన అన్నాడు.