శామీర్పేట, మార్చి 9: శాసనమండలి ఎన్నికల ను సక్రమంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మ రం చేశామని మేడ్చల్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. మహబూబ్నగర్-రంగారెడ్డి – హైదరాబాద్ శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా మేడ్చల్ జిల్లా శామీర్పేటలోని బ్యాలె ట్ బాక్స్ల గోదామును మంగళవారం సందర్శించి భద్రతా వ్యవస్థను పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా సరిపడా సిబ్బందిని నియమించామని, సం గారెడ్డి నుంచి 250, కరీంనగర్ నుంచి 218 బ్యాలె ట్ బాక్స్లను జిల్లాకు తీసుకువచ్చినట్లు తెలిపారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బందిని తరలించేందుకు 41 రూట్లలో రవాణా సౌకర్యం కల్పించనున్న ట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏసీ విద్యాసాగర్, డీఆర్వో లింగ్యానాయక్, తహసీల్దార్ సురేందర్, డీటీ శ్రీనివాస్రెడ్డి, హకీంపేట ఆర్టీసీ డీఎం భాస్కర్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.