లండన్:ఇంగ్లండ్తో త్వరలో మొదలుకానున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత్ను గాయాల బెడద వేదిస్తున్నది. భారత ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఇంగ్లండ్ పర్యటనకు దూరమయ్యాడు. వేలి గాయం తిరగబెట్టడంతో సుందర్.. పర్యటన నుంచి తప్పుకున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సుందర్ గాయపడ్డాడు. సుందర్ కంటే ముందు అవేశ్ ఖాన్, గిల్ సైతం గాయాలతో దూరమయ్యారు.